calender_icon.png 17 June, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలకు నిలయం బిచ్కుంద?

17-06-2025 01:28:17 AM

  1. ఏ శాఖలో కూడా పూర్తిస్థాయి అధికారులు లేరు 

నత్త నడకన సెంట్రల్ లైటింగ్ రోడ్డు వెడల్పు పనులు 

మున్సిపల్‌గా మారినా.. తీరని సమస్యలు 

సబ్ కలెక్టర్ సమస్యలను పట్టించుకోవాలని వినతి 

మురికి కాలువలు దుర్గంధం రోడ్లు అధ్వానం ఇది బిచ్కుంద పట్టణం తీరు

కామారెడ్డి, జూన్ 16 (విజయ క్రాంతి), బిచ్కుంద పట్టణం సమస్యలకు నిలయంగా మారింది. అభివృద్ధిపై పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరైన పనులు  ముందుకు సాగడం లేదు. నిత్యం బిచ్కుంద ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిచ్కుంద వస్తు పోతుంటారు. వాహనదారులు, పాదాచారులు, మహిళలు, వృద్దులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

నత్త నడకన సెంట్రల్ లైటింగ్ పనులు 

కామారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పాటైన బిచ్కుంద మున్సిపల్ పట్టణంలో గత ఏడాదిన్నర క్రితం సెంట్రల్ లైటింగ్ పనులు, రోడ్డు వెడల్పు పనులకు నిధులు మంజూరయ్యాయి. పనులు నత్తనడకన జరుగుతున్నాయి. నిధులు రాకపోవడం వల్లే పనులు చేయడం లేదని కాంట్రాక్టర్ వా పోతున్నారు.

ప్రధాన రోడ్ల పక్కన మురికి కాల్వ లు అధ్వానంగా ఉన్నాయి. దుర్వాసనతో స్థానికులు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మురికి కాలువల నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. జుక్కల్ నియోజకవర్గంలో మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న బిచ్కుందను ఇటీవల మున్సిపల్ గా ప్రభుత్వం ఖరార్   చేసింది. 

పట్టణంగా మారితే అభివృద్ధి జరుగుతుందా...?

కామారెడ్డి జిల్లాలో నూతనంగా మున్సిపాలిటీగా మారిన బిచ్కుంద పట్టణం గా ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి విషయంలో ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణానికి ఉండాల్సిన కనీస మౌలిక వసతులు సమకూర్చాలని బిచ్కుంద ప్రజలు కోరుతున్నారు.

అస్తవ్యస్తంగా రోడ్లు 

బిచ్కుంద పట్టణంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నిత్యం వేలాదిమంది బిచ్కుంద పట్టడానికి వచ్చి వివిధ గ్రామాలు పట్టణాలకు ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. కనీసం బస్టాండ్లో సైతం కనీస వసతులు లేవు. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిసి రోడ్లు బిటి రోడ్లుగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. 

 శిథిలావస్థలో పశు వైద్యశాల

బిచ్కుందలో ఉన్న పశు వైద్యశాల శిథిలావస్థలో ఉంది. కనీసం వైద్యులు కూడా లేకుండా సేవలందిస్తున్నారు. పశువులు అనారోగ్యం బారిన పడితే పశువైద్యుల అందుబాటులో లేకపోవడంతో మృత్యువాత పడుతున్నాయి. ప్రభుత్వం పశువుల సంరక్షణ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టీకాలు మందులు అందిస్తున్నారు. బిచ్కుంద పట్టణ కేంద్రంలో ఉన్న పశువైద్యశాలకు వైద్యులు లేక వైద్యం అందించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిచ్కుంద పట్టణంలో పశువైద్యాధికారిని నియమించాలని కోరుతున్నారు.

అధ్వానంగా గ్రామాల రోడ్లు 

బిచ్కుంద పరిసర గ్రామాలై,న రాజుల్లా, పెద్ద ఎక్లార, దన్నూరు, సోపూ రు, చండీ గావు తదితర గ్రామాల్లో రోడ్లుఅధ్వానంగా ఉన్నాయి. విద్యార్థులకు గర్భిణీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇవాళ ఓ గర్భిణి బైక్ పై వస్తూ జారిపడి మృతి చెందిన విషయం విధితమే. 

ఇప్పటికైనా పాలకులు కళ్లు తెరవాలి 

బిచ్కుంద పట్టణ అభివృద్ధితోపాటు చుట్టుపక్కల గ్రామాల రోడ్ల దుర్భర పరిస్థితి నుంచి పాలకులు గట్టి ఎక్కించాలి. రోడ్లు పర్మనెంట్ గా నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.

అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి 

బిచ్కుంద పట్టణ అభివృద్ధి పై ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతాం. బిచ్కుంద పట్టణముగా మారడంతో ప్రత్యేక నిధులను ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసింది. నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పను లు, రోడ్డు వెడల్పు పనులు, మురికి కాలువల పనులు, చేపట్టే విధంగా అధికారులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు సహకారంతో అభివృద్ధి పనులు చేపడతాం.

 కిరణ్మయి, అదనపు కలెక్టర్