17-06-2025 08:38:53 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో మంగళవారం (Tirumala Tirupati Devasthanam) భక్తల రద్దీ కొనసాగుతుంది. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి(Srivari sarva darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. 84,681 మంది భక్తులు సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. 35,261 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.43 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు(TTD officials) ప్రకటించారు.
తిరుమల సమాచారం
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు(Srivari Arjitha Seva Tickets), దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆన్ లైన్ కోటా విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. రేపు ఉదయం 10 గంటల నుంచి ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆర్జిత సేవల(Arjitha Seva) ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు అవకాశం కల్పించారు. రేపటి నుంచి ఈ నెల 22 వరకు టీటీడీ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలల్లో రెండో విడత కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.