ఇంటర్నెట్పై ఇరాన్ గురి?
- నెక్స్ టార్గెట్ హోర్ముజ్లోని సీకేబుళ్లపైనే!
- ఎర్రసముద్రం అడుగు నుంచి 20 కేబుళ్లు
- హౌతీలతో కలిసి వాటిని కత్తిరించే ప్లాన్
- అదే గనుక జరిగితే ప్రపంచం అల్లకల్లోలం
స్తంభించిపోనున్న వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాలు, ఏఐ సేవలు, ప్రపంచ ఇంటర్నెట్ మొత్తం
టెహ్రాన్, మార్చి 19: హార్ముజ్ జలసంధిలో ఆంక్షలు విధించి, ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తీసుకొ చ్చిన ఇరాన్ ఇప్పుడు తన ప్లాన్ మార్చుకుంది. హార్ముజ్ జలసంధిలో ఉన్న ఇంటర్నెట్ కేబుళ్లే అని.. హౌతీలతో కలిసి వాటిని కత్తిరించబోతుం దని ఇంటర్నేషనల్ వార్త సంస్థలు కథనాలు వెల్లడించాయి. అదే గనుక జరిగితే ప్రపంచం అల్లకల్లోలం అవుతుందని అందోళవ్యక్తం చేస్తున్నాయి. అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయి.
కీలక రంగాలు అన్ని కూడా మూతప డిపోతాయి. భారతదేశంతో పాటు, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఘోరంగా దెబ్బతింటాయని తెలిపాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం మూడో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్ ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించి, ప్రపంచానికి ఇంధన సరఫరాలను స్తంభింపచేస్తోం ది. అయితే మరోపక్క కీలకమైన సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లు హోర్ముజ్ గుండానే వెళ్తాయి.
చమురు సంస్థలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం రెండో దశలోకి ప్రవేశించిన నేపథ్యంలో, టెహ్రాన్ తదుపరి ఇంటర్నెట్ కేబుళ్లను టార్గెట్ చేసుకుంటుందని సమాచారం. ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్-మం డ్పై కూడా ఇరాన్ ప్రాక్సీ హౌతీలు దాడి చేయవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ డిజిటల్ లైన్లు కూడా సముద్రగర్భ కేబుళ్ల రూపంలో ఈ మార్గాల గుండా వెళ్తా యి. ఇరాన్ హోర్ముజ్ జలసంధికి అడ్డంగా సముద్ర మైన్లను అమర్చింది.
ఇది షిప్పింగ్ లైన్లు, బీమా కంపెనీలను భయపెట్టి, సురక్షిత మార్గాలు క్లియర్ అయ్యే వరకు అన్ని రకాల రాకపోకలను నిలిపివేసేలా చేసింది. ఇంత లో, ఎర్ర సముద్రంలో, యెమెన్కు చెందిన హౌతీ గ్రూపులు ప్రయాణిస్తున్న నౌకలపై కాల్పులు జరుపుతున్నాయి. ఆ ఇరుకైన జలమార్గాన్ని కూడా ప్రమాదకర ప్రాంతంగా మారుస్తున్నాయి. ఈ రెండు కీలక ప్రదేశాలు సముద్రగర్భంలో వేయబడిన ఫైబర్- ఆప్టిక్ కేబుళ్ల భారీ వలయంపైనే ఉన్నాయి.
ఈ సన్నని తీగలు వేలాది కిలోమీటర్ల మేర విస్తరించి, వీడియో కాల్స్, ఈ-మెయిల్స్ నుంచి బ్యాంకింగ్ బదిలీలు, ఏఐ సేవల వరకు, ప్రపంచ ఇంటర్నెట్కు శక్తినిచ్చే దాదాపు మొత్తం డేటాను మోసుకెళ్తాయి. ఎర్ర సము ద్రం, హోర్ముజ్ జలసంధిలో కనీసం 20 సముద్రగర్భ కేబుళ్లు ఉన్నాయి. ప్రపంచ టెలికాం, డేటా సెంటర్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిశ్రమ వార్తల వెబ్సైట్ అయిన కెపాసిటీ గ్లోబల్ నివేదిక ప్రకారం, ఎర్ర సము ద్రం గుండా 17 సముద్రగర్భ కేబుళ్లు వెళ్తున్నాయి.
ఈ కేబుల్స్ యూరప్, ఆసియా, ఆఫ్రికాలను అనుసంధానించే ఇంటర్నెట్ ట్రాఫిక్లో ప్రధాన భాగాన్ని మోసుకెళ్తాయి. హోర్ముజ్ జలసంధిని దాటే కేబుల్స్ కూడా అంతే ముఖ్యమైనవి. కేబుల్ డేటాకు ప్రముఖ మూలమైన టెలిజియోగ్రఫీ నివేదిక ప్రకారం, పర్షియన్ గల్ఫ్లో చురుకుగా ఉన్న సముద్రగర్భ కేబుల్స్లో ఏఏఈ1, ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ కేబుల్ సిస్టమ్, టాటా-టీజీఎన్ గల్ఫ్ ఉన్నాయి. ఈ లైన్లు భారతదేశ విదేశీ డేటా కనెక్షన్లకు నేరు గా మద్దతు ఇస్తాయి.
కేబుళ్లను కట్ చేస్తే మరమ్మతులు అసాధ్యమే..
ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి రెండు మార్గాలూ మూసుకుపోవడంతో, మ రమ్మతు పనులు దాదాపు అసాధ్యమవుతాయి. తెగిపోయిన కేబుళ్లను సరిచేయడాని కి అవసరమైన ప్రత్యేక నౌకలు ఆ ప్రాంతంలోకి సురక్షితంగా ప్రవేశించలేవు. మైన్ దాడి లేదా ఉద్దేశపూర్వక కోత వల్ల లైన్లు తెగిపోతే వారాలు లేదా నెలల తరబడి పనిచేయకుండా పోవచ్చు.
భీకర సైనిక దాడులు జరుగుతున్న ప్రాంతాలలో కేబుల్ నౌకలు పనిచేయవని, అది చాలా ప్రమాదకరమని టెలిజియోగ్రఫీకి చెందిన అలన్ మౌల్డిన్ చెప్పినట్లు బ్లూమ్బెర్గ్ పేర్కొంది. నెట్వర్క్ సంస్థ కెంటిక్లో ఇంటర్నెట్ విశ్లేషణ డైరెక్టర్గా ఉన్న ఇంటర్నెట్ విశ్లేషకుడు డగ్ మాడోరీ, ప్రస్తుత ప్రమాదాల గురించి హెచ్చరించాడు. రెండు కీలక మార్గాలను ఏకకాలంలో మూ సివేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగించే సంఘటన అవుతుందని ఆయన పేర్కొన్నారు.
న్యూయార్క్ టైమ్స్ ప్రకారం, హోర్ముజ్ జలసంధిలోని అత్యంత ఇరుకైన ప్రదేశంలో నీటి లోతు కేవలం 200 అడుగులు మాత్రమే ఉంది. కాబట్టి కేబుళ్లు అత్యంత ప్రమాదక స్థాయిలోనే ఉన్నాయి. అయితే ఇరాన్కు చెందిన నీటి అడుగున బృందాలు, రహస్య నౌకాదళం ఇప్పటికీ ఆ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు సమాచారం.




