07-06-2025 07:22:07 PM
టెల్ అవీవ్: అక్టోబర్ 7, 2023న గాజాలోకి కిడ్నాప్ చేయబడిన థాయ్ బందీ మృతదేహాన్ని(Body Of Thai Hostage) స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్(Israel) తెలిపింది. ప్రత్యేక సైనిక ఆపరేషన్లో థాయ్ పౌరుడు నట్టపాంగ్ పింటా మృతదేహాన్ని ఇజ్రాయెల్కు తిరిగి ఇచ్చామని ప్రధాన మంత్రి కార్యాలయం(Prime Minister's Office) శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యవసాయం కోసం థాయిలాండ్ నుండి ఇజ్రాయెల్కు వచ్చిన నట్టపాంగ్ ను పింటాను కిబ్బట్జ్ నిర్ ఓజ్ నుండి అపహరించి యుద్ధం ప్రారంభంలోనే చంపినట్లు ప్రభుత్వం వివరించింది. హమాస్ ఉగ్రవాదులు బందీలుగా ఉంచిన విదేశీ కార్మికులలో థాయ్ జాతీయులు అతిపెద్ద సమూహం. ఇద్దరు ఇజ్రాయెల్-అమెరికన్ బందీల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న రెండు రోజుల తర్వాత ఈ రికవరీ జరిగింది.
గాజాలో ఇప్పటికీ 55 మంది బందీలుగా ఉన్నారని భావిస్తున్నారు. వీరిలో సగానికి పైగా చనిపోయారని ఇజ్రాయెల్ చెబుతోంది. పింటా మృతదేహాన్ని రఫా ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ మంత్రి ఇవాళ తెలిపారు. గురువారం ఇజ్రాయెల్ జుడిత్ వీన్స్టీన్, గాడ్ హగ్గై మృతదేహాలను స్వాధీనం చేసుకున్న వీరిద్దరూ ద్వంద్వ ఇజ్రాయెల్, యుఎస్ పౌరసత్వం కలిగి ఉన్నారు. ఇజ్రాయెల్ గాజాలో సైనిక దాడిని కొనసాగిస్తున్నందున ఈ రికవరీ ఆపరేషన్ జరిగింది. శుక్రవారం నుండి శనివారం వరకు రాత్రిపూట ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 22 మంది మరణించినట్లు సమాచారం.