07-06-2025 11:37:12 PM
వెలుగులోకి ఆశ్చర్యపోయే విషయాలు..
న్యూఢిల్లీ: గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన పంజాబ్ యూట్యూబర్ జస్బీర్ సింగ్(YouTuber Jasbir Singh) విషయంలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జస్బీర్ సింగ్ రిమాండ్లో పంజాబ్ పోలీసులు(Punjab Police) కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. జస్బీర్ సింగ్ ఫోన్లో పాకిస్థాన్కు చెందిన 150 మంది ఫోన్ నంబర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జస్బీర్ సింగ్ ఇప్పటికే ఆరుసార్లు పాకిస్థాన్ను సందర్శించినట్టు విచారణలో తేలింది.
జస్బీర్ సింగ్ ‘జాన్ మహల్’ అనే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. అంతే కాకుండా జస్బీర్ సింగ్ తన ల్యాప్టాప్ను పాక్ ఇంటెలిజెన్స్ అధికారి ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇతర గూఢచారుల మాదిరిగానే జస్బీర్ కూడా పాక్ ఐఎస్ఐ ఏజెంట్ డానిష్తో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. తన మిత్రురాలి ద్వారా డానిష్తో పరిచయం ఏర్పడినట్టు జస్బీర్ పంజాబ్ కోర్టులో తెలిపాడు.