మాదిగలకు ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం శోచనీయం

02-05-2024 01:56:03 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (విజయక్రాంతి): తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ అధిష్ఠానం వాటిలో ఒక్క సీటైనా మాదిగలకు కేటాయించకపోవడం శోచనీయమని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తిమ్మన నవీన్‌రాజు అన్నారు. బషీర్‌భాగ్‌లోని బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహం ఎదుట బుధవారం సంఘం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నవీన్‌రాజు మట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మాదిగలకు బహిరంగ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. లేదంటే మాదిగలకు అన్యాయం చేసిన సీఎంగా రేవంత్‌రెడ్డి చరిత్రలో మిగిలిపోతారన్నారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ములుగు కోటేశ్వర్‌రావు, సిటీ వర్కింగ్‌ప్రెసిడెంట్ జగదీశ్వర్‌రావు, నాయకులు కృష్ణ, శంకర్‌రాజు పాల్గొన్నారు.