21 August, 2026 | 12:13 PM

Breaking News

ఆటోనగర్ ఏర్పాటుకు నూతన కార్యవర్గం ఎన్నిక   •   వేం నరేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు   •   ఒకే విగ్రహం.. రెండు నివాళులు..! కాంగ్రెస్‌లో మళ్లీ వేడెక్కిన చర్చ   •   కేసముద్రంలో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో   •   హెచ్.సి.యూలో సీటు సాధించిన విద్యార్థినిని సన్మానించిన సర్పంచ్   •   ఇందిరమ్మ ఇండ్ల సర్వే పేరుతో లబ్ధిదారుల్ని తికమక పెట్టదు   •   అమెరికా పర్యటన కొనసాగించండి... అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం   •   హైదరాబాద్‎కు మాజీ సీఎం జగన్.. భారీగా వెలిసిన కటౌట్లు   •   వరలక్ష్మీ వ్రతం పూజా విధానం, తోరం కట్టే సంప్రదాయం ఇదే!   •   క్షేత్రస్థాయిలోనే భూ సమస్యలకు పరిష్కారం   •  

స్పీకర్‌కు జగదీశ్‌రెడ్డి సారీ చెప్పాలి

15-03-2025 12:00 AM

రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి

చేవెళ్ల, మార్చి 14: అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను అవమానించేలా మాట్లాడిన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు  జ్యోతి భీమ్ భరత్ డిమాండ్ చేశారు. 

శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. స్పీకర్ దళితుడు అయినందునే బీఆర్ఎస్ పార్టీ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.ప్రసాద్ కుమార్ అట్టడుగు నుంచి స్పీకర్ స్థాయికి ఎదిగారని, అది ఓర్వలేకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారం కోల్పోవడంతో దిగజారి ప్రవర్తిస్తున్నారని, దీన్ని బట్టే వారి విధానాలేంటో అర్థం చేసుకోవచ్చన్నారు. పదేళ్లుగా మంత్రిగా పనిచేసిన జగదీశ్ రెడ్డికి సభా సంస్కారాలు తెలియక పోవడం బాధాకరమని మండిపడ్డారు.  శాసనసభ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన  సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.