15 April, 2026 | 3:21 AM

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జడ్జ్ యువరాజ్

14-02-2026 05:08 PM

పెంచికల్పేట,(విజయక్రాంతి): పెంచికల్పేట మండలంలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంను ఆసిఫాబాద్ సివిల్ కోర్టు సీనియర్ జడ్జ్ యువరాజ్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు కోరుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ పూజలు నిర్వహించి జడ్జ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ విశిష్టత, చరిత్ర గురించి ఆలయ ప్రతినిధులు వివరించారు. స్థానిక ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు జడ్జ్ యువరాజ్‌ను కలసి ఘనంగా స్వాగతం పలికారు.