1 July, 2026 | 9:14 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

కేజ్రీ బెయిల్‌పై తీర్పు రిజర్వ్

06-09-2024 12:05 AM
  1. సెప్టెంబర్ 10న నిర్ణయం వెల్లడించనున్న సుప్రీం 
  2. అప్పటివరకు జైలులోనే ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇంకా ఊరట లభించలేదు. సీబీఐ కేసులో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు పూర్తి కాగా తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. గురువారం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. సెప్టెంబర్ 10న తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఫలితంగా మరికొన్ని రోజులు కేజ్రీవాల్ జైలులోనే ఉండనున్నారు. వాదనల సందర్భంగా కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ సీబీఐ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో రెండేళ్ల వరకూ ఢిల్లీ సీఎంను అరెస్టు చేయలేదని, ఈడీ కేసులో బెయిల్ రాగానే సీబీఐ అరెస్టు చేసిందని తెలిపారు. అరెస్టు ముందు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంలో సీబీఐ తీరుపై ధర్మాసనం కూడా అసహనం వ్యక్తం చేసింది.