24-11-2025 10:16:53 AM
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో నూతన సీజేఐ ప్రమాణస్వీకారం కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్ తో ప్రమాణం చేయించారు. సీజేఐ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, పలువురు కేంద్రమంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి, పలు దేశాల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. జస్టిస్ సూర్యకాంత్ 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐ పదవిలో కొనసాగనున్నారు.
తొలి హర్యానా వాసి జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 1981లొ డిగ్రీ పూర్తి చేశారు. 1984లో మహర్షి దయానంద్ వర్సిటీ నుంచి జస్టిస్ సూర్యకాంత్ న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1984లో హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా సూర్యకాంత్ ప్రాస్టీస్ చేశారు. 1985లో పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో పనిచేశారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా కోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయవాదిగా జస్టిస్ సూర్యకాంత్ పదోన్నతి పొందారు. రెండు దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు.