20-06-2025 12:12:12 AM
కమల్హాసన్ కథానాయకుడిగా వచ్చిన చిత్రం ‘థగ్లైఫ్’ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కర్ణాటకలో విడుదలకు నోచుకోలేని విషయమూ విదితమే. అయితే, తాజాగా ఈ సినిమా స్క్రీనింగ్కు రక్షణ కల్పిస్తామంటూ కర్ణాటక ప్రభుత్వం ఎట్టకేలకు హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీంతో కన్నడనాట ఈ చిత్రంపై అనధికారిక బ్యాన్కు సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) విచారణను జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ మన్మోహన్ బెంచ్ ముగించింది.
ఈ చిత్రం స్క్రీనింగ్కు అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ బెంగళూరుకు చెందిన ఎం మహేశ్రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిల్పై గురువారం న్యాయస్థానం విచారణ చేపట్టగా.. ఈ సందర్భంగా బెంచ్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు సంఘాలు తరుచూ ఆందోళనలు చేయడంతో కళాసృష్టి నిలిచిపోతుందని పేర్కొంది. వీటిని ఇకపై ఏమాత్రం కొనసాగనీయమని స్పష్టం చేసింది. కేవలం ఒక అభిప్రాయం వల్ల ఒక చిత్రాన్ని ఆపేయాలా..? స్టాండప్ కామెడీని నిలిపివేయాలా..? అంటూ ప్రశ్నించింది బెంచ్.