19-06-2025 06:45:26 PM
జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాల్రాజు..
భద్రాచలం (విజయక్రాంతి): మాల మహానాడు ముఖ్య కార్యకర్తలు సమావేశం భద్రాచలం ఏఎంసీ కాలనీలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి పాల్రాజు(Mala Mahanadu District Chief Secretary Alladi Palraju) హాజరయ్యి మాట్లాడుతూ... కార్తీక్ కి డివిజన్ పదవి ఇవ్వడం జరిగిందనీ, మాలల గురించి కష్టపడాలని మాల విద్యార్థులు, మాల మేధావులు మాలల్ని గౌరవించి ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిని కార్తీక్ కి డివిజన్ అధ్యక్షుడుగా నియమించటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బర్ల రామకృష్ణ ,శ్యాము, కనకరాజు, యేసు, శాంతి, రాజు, శామ్యూల్ రాజు, దర్శన్, బాబు, తదితరులు పాల్గొన్నారు.