calender_icon.png 19 June, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విమాన ప్రమాద మృతులకు సంతాపం

19-06-2025 06:42:02 PM

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్..

కోదాడ: ఇటీవల జరిగిన విమాన ప్రమాదం అత్యంత బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతయ్య సుధీర్(Agricultural Market Committee Chairperson Epuri Tirupathaiah Sudheer) అన్నారు. గురువారం కోదాడ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కమిటీ సాధారణ 4వ సమావేశం చైర్ పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో విమాన ప్రమాదంలో మృతిచెందిన వారికి నివాళులర్పించారు.

అనంతరం మార్కెట్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని చైర్ పర్సన్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ చైర్మన్ బషీర్, గ్రేడ్ వన్ సెక్రటరీ రాహుల్, డైరెక్టర్లు వీరబాబు, మల్లు వెంకట్ రెడ్డి, చింతకుంట్ల సూర్యం, అభిరామ్, అమర్ సింగ్, నాగ వేణు, శ్రీనివాస్, మణెమ్మ, వెంకటేశ్వర్లు, శ్రీను, నర్సిరెడ్డి, అకౌంటెంట్ శ్రీను, సూపర్వైజర్ రంజిత్ ఉన్నారు.