7 April, 2026 | 3:23 PM

Breaking News

అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •  

తెలంగాణకు స్వాతంత్య్రం తెచ్చిన మహనీయుడు.. పటేల్

29-10-2024 01:27 PM

హైదరాబాద్: అసెంబ్లీ వద్ద ఉన్న పటేల్ విగ్రహానికి బీజేపీ నేతలు నివాళులర్పించారు. ఏకతా దివస్ లో భాగంగా పటేల్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఏడాదిపాటు ప్రతి గ్రామంలో పటేల్ జయంతి వేడుకలు చేస్తామన్నారు. తెలంగాణకు స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు.. పటేల్.. నిజాం నవాబు మెడలు వంచిన ఘనుడు.. వల్లభాయ్ పటేల్ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏక్ పోలీస్ విధానంపై ఆయా సంఘాలు, కుటుంబాలతో చర్చించాలని సూచించారు. తెలంగాణలో బర్తరఫ్ చేసిన కానిస్టేబుళ్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.