దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు
12-03-2026 06:02 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కార్పెంటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసోహం వెంకటేశ్వర్లు, ఆయన బ్రదర్స్ ను మంగళవారం స్వర్ణకార సంఘం నాయకులు పరామర్శించారు, ఇటీవల దాసోహం వెంకటేశ్వర్లు తల్లి సరోజన అనారోగ్యంతో మృతిచెందగా స్వర్ణకార సంఘం రాష్ట్ర నాయకులు కందుకూరి ప్రకాష్ రావు( పెద్దన్న), స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు పొలాస సత్యనారాయణ, కార్పెంటర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పూసల ఆంజనేయులు , సంఘ నాయకులు జూపాక కుమారస్వామి , పల్లి రాకేష్ లు దాసోహం బ్రదర్స్ ను పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.




