12 March, 2026 | 11:42 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం

12-03-2026 06:04 PM

ముఖ్యఅతిథిగా పాల్గొని  వాలంటీర్లకు సొంత నిధులతో సాలరీ అందించిన దొంతిరి హరిశంకర్ రెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ని జెడ్‌పిహెచ్‌ఎస్  మెడిపల్లి పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. సత్య ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్  దొంతిరి హరిశంకర్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. అదేవిధంగా పాఠశాలలో సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలను అభినందిస్తూ  హరిశంకర్ రెడ్డి నాలుగు నెలల జీతాలను స్వయంగా అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.