1 July, 2026 | 10:29 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రజతోత్సవ సభ బహిరంగ సభకు కదలి వెళ్దాం

26-04-2025 04:50 PM

భద్రాచలం పట్టణం నుంచి వందలాదిగా తరలిరావాలి..

బిఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్..

భద్రాచలం (విజయక్రాంతి): 25 సంవత్సరాల బిఆర్ఎస్ రజతోత్సవ సభను భద్రాచలం మండలం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ అన్నారు. శనివారం భద్రాచలంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. భద్రాచలం మండలం నుండి 40 కార్ల ద్వారా జన సమీకరణ జరుగుతుందని.. పార్టీ అభిమానులు కార్యకర్తలు వివిధ వార్డుల నుండి అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో మండల పార్టీ కో కన్వీనర్ రేపాక పూర్ణచందర్రావు, సీనియర్ నాయకులు కొల్లం జయ ప్రేమ్ కుమార్, మహిళా నాయకురాలు సీతా మహాలక్ష్మి, యువజన నాయకుడు మురలా డానియల్ ప్రదీప్, కార్మిక విభాగం నాయకులు చిట్టిమల్ల అనిల్ కుమార్ ఉన్నారు.