30-06-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి,దండే విఠల్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 29(విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం, జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన కుమ్రం భీం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు.ఆదివారం కౌటాల మండలం జనగాం గ్రామంలో ఏర్పాటు చేసిన భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా,గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
ఆదివాసీల హక్కుల పరిరక్షణ ,వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణ ,బీసీసీబీవైస్ చైర్మన్ మాంతయ్య ,ఆదివాసి సంఘం నాయకులు ధర్మారావు, సు ధాకర్, రామ్ దాస్, చరణ్ దాస్ ,నాయకు లు శ్రీ వర్ధన్, పండు, హనుమంతు ,గట్ట య్య, శంకర్ పోశం, పాల్గొన్నారు.