calender_icon.png 30 June, 2025 | 10:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయాలకు నిధులు మంజూరు

30-06-2025 12:00:00 AM

ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

నిర్మల్ జూన్ 29( విజయ క్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధికి నిధులు  మంజూరు చేయించిన ట్లు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇందు లో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలోని సారంగాపూర్ మండలం రాజేశ్వర్ తం డాలో జగదాంబ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి 12 లక్షలు. సారంగాపూర్ మండలం రవీంద్రనగర్ తండాలో జగదాంబ సేవాలాల్ ఆలయ నిర్మాణానికి 12 లక్షలు.

మామడ మండలం గాయద్ పల్లి గ్రామం లో హనుమాన్ ఆలయ నిర్మాణానికి 12.ల క్షలు నిర్మల్ రూరల్ మండలం ముజ్గి గ్రా మంలో భీమన్న ఆలయ నిర్మాణానికి 12.ల క్షలు మామడ మండలం బూరుగుపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి 12 లక్షలు. నిర్మల్ పట్టణంలోని నాగేశ్వరవాడ ఆల య అభివృద్ధికి 12.లక్షలు. మామడ మండలం చెరువు ముం దు తండాలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి 12.లక్షలు.

నిర్మల్ పట్టణంలోని కాల్వగడ్డ, గాంధీచౌక్ దగ్గరలో గల శివాలయ (అదనపు) నిర్మాణ పనులకు 12. లక్షలు విడుదలైనట్టు తెలిపారు. సారంగాపూర్ మండలం రాంసింగ్ తండాలో జగదాంబ సేవాలాల్ ఆలయ ప్రాంగణంలో కాంపౌండ్ నిర్మాణానికి 12.లక్షలు  నియోజకవర్గంలోనీ 9 ఆలయాలకు 1కోటి 8లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గారు పత్రిక  ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు.