29 June, 2026 | 3:03 PM

Breaking News

లారీ ఢీ.. పలువురికి గాయాలు

19-04-2025 01:58 AM

అనంతగిరి ఏప్రిల్ 18: మండల పరిధిలోని అనురాగ్ కళాశాల సమీపంలో లారీ ఢీకొని పలువురికి గాయాలైనట్లు ఎస్‌ఐ నవీన్ కుమార్ తెలిపారు ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణం గాంధీనగర్ కు చెందిన కాసర్ల శ్యాంసుందర్ మండల పరిధిలోని  త్రిపురవరం గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి చర్చికి వెళుతుండగా అనురాగ్ కళాశాల దాటిన తర్వాత లారీ  ఢీకొట్టడంతో శ్యాంసుందర్ కుటుంబ సభ్యులకు  గాయాలైనట్లు తెలిపారు కాసర్ల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.