21 April, 2026 | 4:45 PM

Breaking News

మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •  

మైసయ్యగౌడ్ సేవలు మరువలేనివి

28-03-2025 12:00 AM

ఎమ్మెల్సీ అంజిరెడ్డి

నల్లగొండ, మార్చి 27 (విజయక్రాంతి) :  పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గుండగోని బీజేపీ రాష్ట్ర నాయకుడు దివంగత మైసయ్యగౌడ్ చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్సీ చిన్నమెయిల్ అంజిరెడ్డి అన్నారు. మైసయ్య గౌడ్ 27వ వర్ధంతి సందర్బంగా గురువారం నల్లగొండలోని  ఆయన విగ్రహానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి కలిసి ఆయన నివాళులర్పించారు.

అనంతరం సంస్మరణ సభలో ఎమ్మెల్సీ మాట్లాడారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహానాయకుడు మైసయ్య గౌడ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు బీజేపీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. పార్టీ మైసయ్యగౌడ్ చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.

కార్యక్రమంలో సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు గోలి మధుసూదన్ రెడ్డి, నాయకులు వీరెళ్లి చంద్రశేఖర్, గుండగోని గిరిబాబు, దోనూరు వీరా రెడ్డి, సాధినేని శ్రీనివాస్, బీజేపీ నల్లగొండ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, పలువురు కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.