18 April, 2026 | 10:52 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

స్టాక్ ట్రేడింగ్ పేరిట మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

28-03-2025 12:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 27(విజయక్రాంతి) : స్టాక్ ట్రేడింగ్ పేరిట మోసం చేస్తున్న  ఓ వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ వ్యక్తిని అపరిచిత వ్యక్తి ఫిడిలిటీ ఇంటర్నేషనల్ వెల్త్ సెంటర్ అనే వాట్సప్ గ్రూప్‌లో చేర్చాడు. ఆ గ్రూప్‌లోని సభ్యులు తమకు ట్రేడింగ్‌లో వేచ్చే లాభాల స్క్రీన్ షాట్‌లను అందులో షేర్ చేశారు. అది నమ్మి సదరు వ్యక్తి కూడా ట్రేడింగ్ ఖాతాను తెరిచి పెట్టుబడులు పెట్టాడు. తన ఖాతాలను నడిపేందుకు సదరు వ్యక్తి గ్రూప్‌లోని సైబర్ నేరగాళ్లకు రూ.6.20లక్షలకు బదిలీ చేశాడు. బాధితుడు పెట్టుబడి వద్దనుకున్నపుడు సైబర్ నేరగాళ్లు అతన్ని బెదిరంచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. గుజరాత్‌కు చెందిన లలిత్‌కుమార్‌జైస్వాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనిపై తెలంగాణలో 3కేసులు దేశవ్యాప్తంగా 16కేసులున్నట్లు గుర్తంచారు.