15 April, 2026 | 1:44 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

అక్రమ సంబంధానికి నిండు ప్రాణం బలి

10-01-2026 09:39 PM

గద్వాల: ఈనెల 4న గట్టు మండలం మొసల్ దొడ్డి శివారులో జరిగిన హత్య కేసులో నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. శనివారం గద్వాల సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గద్వాల డీఎస్పీ వై.మొగులయ్య వివరాలు వెల్లడిండించారు. గట్టు మండలం బల్గెర గ్రామానికి చెందిన తిమ్మప్ప అన్న భార్య సువార్తమ్మతో మిట్టదొడ్డి గ్రామానికి చెందిన అబ్రహంతో అక్రమ సంబంధ కొనసాగుతుంది.

అక్రమ సంబందానికి తిమ్మప్ప అడ్డు వస్తుండటంతో అబ్రహం పథకం ప్రకారం ముసల్ దొడ్డి శివారులో తిమ్మప్ప, అబ్రహంలు కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో తిమ్మప్పను అబ్రహం రాయితో కొట్టి చంపి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున గట్టు ఎస్ఐ కెటిమల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేయగా, అందులో భాగంగా శనివారం ఉదయం నిందితుడు అబ్రహంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, గట్టు ఎస్ఐ కెటిమల్లేష్, తదితరులు పాల్గొన్నారు.