calender_icon.png 8 June, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాల్పుల విరమణపె ప్రశ్నలెన్నో!

23-05-2025 12:12:46 AM

డాక్టర్ తిరునహరి శేషు :

పాకిస్థాన్ నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన రాగానే, భా రత్ ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నది? అనే అసంతృప్తి భారత ప్రజల్లో కలిగిన మాట వాస్తవం. కాల్పుల విరమణ అవగాహన అమెరికా ముందుగా ప్రకటించడంపై కూ డా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

కాల్పుల విరమణ ఒప్పందానికి వాణిజ్య అం శాలకు ముడిపెట్టి, తన చిరకాల మిత్రదేశమైన పాకిస్థాన్‌ని కాపాడుకునే ప్రయత్నం అమెరికా చేసిందా? అనే అనుమానాలు సైతం కలుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ అతిక్రమించటం కాల్పు ల విరమణ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి.

వాణిజ్య అవసరాల ప్రాతిపదికగానే రెండు దేశాల మధ్య కా ల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిరిచ్చానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడటం, కాల్పుల విరమణ తర్వాత అమెరికా తో భారత్ జీరో టారిఫ్ వాణిజ్యానికి ఒ ప్పుకొన్నదనే ప్రకటన చేయటం పలు అనుమానాలకు తావిస్తున్నది. అమెరికా మధ్యవర్తిత్వంతో హఠాత్తుగా భారత్ కా ల్పుల విరమణకు ఒప్పుకొన్న పరిణామా లు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. 

అమెరికా మధ్యవర్తిత్వంపై అసంతృప్తి..

భారత్ పాక్ పరస్పరం దాడులు చేసుకుంటున్న తరుణంలో, ఈనెల 10న పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాదార్ మాట్లాడుతూ.. ‘భారత్ దాడులు ఆపితే మేం కూ డా దాడులు ఆపేస్తాం’ అని ప్రకటించిన గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ డీజీఎంవో నుంచి కాల్పుల విరమణ ప్రతిపాదన వ చ్చినట్లుగా, అందుకు భారత్ కూడా అంగీకరిస్తున్నట్లు ప్రకటించటాన్ని హఠాత్పరిణా మంగానే భారత ప్రజలు భావించారు.

మరి కాల్పుల విరమణ ఒప్పందాన్ని రెండు దేశాల సంయుక్త ప్రకటనా, లేదా అవగాహనా, లేదా ఒప్పందమా? అనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. మరీ ముఖ్యంగా భారత్, పాక్‌కంటే ముందుగానే అమెరికా కాల్పుల విరమణను ప్రకటించడం ఎక్కువ మంది ప్రజానీకాన్ని విస్మయానికి గురిచేసింది. రెండుదేశాల కాల్పుల విరమణపై అమెరికా జోక్యం చేసుకోవటాన్ని మెజార్టీ భారతీయులు ఆక్షేపిస్తున్నారు.

‘కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే అమెరికా రెం డు దేశాలతో వాణిజ్య సంబంధాలు పెట్టుకోబోదు’ అని రెండు దేశాలను బెదిరిం చామని ట్రంప్ వ్యాఖ్యానించడాన్ని కూడా భారతీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ.. అమెరికా మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్ ఆహ్వానించడం గమనార్హం. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా ఎందుకు చొరవ చూపింది? అనే అం శంపై అనేక ఆసక్తికరమైన కథనాలు వినవస్తున్నాయి.

భారత్ ప్రస్తుతం అమెరికాకి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార భాగస్వామి. 2024లోనే అమెరికాతో భారత్ 129 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య సంబంధాలు నెరపింది. అమెరికాకు పాకిస్థాన్ మొదటి నుంచి నమ్మకమైన మిత్రదేశమేమీ కాదు, పాకిస్థాన్ కేవలం అమెరికా నుంచి పెద్దఎత్తున ఆయుధాలను కొనుగోలు చేస్తుందనే కారణంతోనే ట్రంప్ ఆ దేశానికి పరోక్షంగా కాపాడే ప్రయత్నం చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ ఇక ఓటమి అంచుకి వెళ్తున్నదన్న క్రమంలోనే ట్రంప్ కాల్పుల విరమణ ప్రతిపాదన తీసుకువచ్చారనే విమర్శలున్నాయి.

ప్రపంచ దేశాలు ఎటు వైపు? 

అలీన విధానాన్ని అనుసరించి భారత్ గతంలో ఎన్నో పొరుగు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకున్నది. అందుకే ప్రపంచ దేశాలు భారత్‌ను మిత్ర దేశంగానే భావిస్తాయి. భారత్ ‘హిందూ ము స్లిం భాయి భాయి.. హిందూ చినీ భాయి భాయి’ అనే స్ఫూర్తితోనూ గతంలో ఉన్న సమస్యలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకునే ప్రయత్నాలు చేసింది.

గత నెలలో ముష్కరులు కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ నిర్ణ యం తీసుకున్నది. ఆ నిర్ణయం సరైనదేనని, భారత్‌కు దాడులు చేసే హక్కు ఉంద ని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అభిప్రాయపడ్డాయి. అయితే.. బలంగా భారత్ వైపు నిలబడిన దేశాలు రష్యా, ఇజ్రాయెల్ మాత్రమే.

2023లో తుర్కియేలో భూకం పం సంభవిస్తే ‘ఆపరేషన్ దోస్’్త పేరిట ప్రప్రథమంగా ఆదేశాన్ని ఆదుకున్న ది భార త్ మాత్రమే. కానీ.. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు తుర్కి యే మాత్రం పాక్ పక్షాన నిలిచింది. తుర్కియేనే కాక ఇరాన్, చైనా, అజర్‌బైజాన్ వంటి దేశాలు కూడా పాక్‌కే మద్దతుగా నిలిచాయి. ఆ మద్దతును ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కుట్రలకు మద్దతుగానే భావించాల్సి ఉంటుంది.

భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ పాక్‌కు బెయిల్ అవుట్ ప్యాకేజీ కింద 2.3 బిలియన్ డాలర్ల తక్షణ ఆర్థిక సాయం ప్రకటించడం వెనుక అమెరికా ప్రోద్బలం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పాకిస్థాన్  అరబ్ దేశాల మద్దతు ఆశించినప్పటికీ, ఆయా దేశాల నుంచి ఎలాంటి మద్దతు లభించకపోవడం గమనార్హం.

మున్ముందు పరిణామాలేంటో..

పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారత్‌పై ఎన్నో సందర్భాల్లో దాడులు చేశాయి. అమాయకులైన భారత పౌరుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాయి. దా యాదితో భారత్ పోరాడిన అనేక సందర్భాల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతు న్నారు. లష్కర్ ఏ తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు అనబంధ సంస్థకు చెందిన ముష్కరులు గత నెలలో మినీ స్విట్జర్లాండ్‌గా పేరున్న పహల్గాంలోని బైసరన్‌లో 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు.

ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదులకు సరైన గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. భారత్ సైన్యం ఆ దేశపు గగనతలానికి వెళ్లకుండా నే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని ఐదు, పాకిస్థాన్‌లోనే నాలుగు ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఆయా స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసింది.

జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, ముజాహిద్దీన్ లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది. అందుకు ప్రతీకారం గా పాకిస్థాన్ సైన్యం అన్నిరకాల యుద్ధ నియమాలు, నైతికతను ఉల్లంఘిస్తూ భారత సరిహద్దు గ్రామాలపై, ప్రజలపై, జనావాసాలపై దాడులకు దిగింది. డ్రోన్లు, క్షిపణు లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడింది.

భారత సైన్యం కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తే, పాకిస్థాన్ మాత్రం భారత్ పౌరులను టార్గెట్ చేసింది. ఈ విషయాన్నే భారత్ మున్ముం దు అంతర్జాతీయ సమాజానికి చెప్పబోతున్నది. పాక్‌ను దోషిగా, ఉగ్రవాద ప్రేరేపిత దే శంగా నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నది. ఉగ్రవాదాన్ని నిర్మూలించనంత కా లం సింధూ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరిం చే ప్రశ్నే లేదని భారత్ స్పష్టం చేయ టమే కాదు..

పహల్గాం మారణకాండను, ఆపరేషన్ సిందూర్‌ని, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలను ప్రపంచం ముందు పెట్టేం దుకు భారత్ దౌత్యపరంగా ఏడు ఎంపీ బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృం దాలు వేర్వేరుగా 33 దేశాలకు వెళ్లి పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయనున్నా యి.

అవన్నీ దౌత్యపరంమైన ఎత్తుగడలే. ‘భారత్ వైఖరి ఎల్లప్పుడూ బాధ్యతా యుతంగా, శాంతియుతంగా ఉంటుంది’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్న మాటలు అక్షర సత్యం. భారత్ ఆచరణలో ఆ సైద్ధాంతికతను కచ్చితంగా అవలంబిస్తుంది.

  వ్యాసకర్త సెల్‌నంబర్ 

98854 65877