09-04-2025 01:55:06 AM
పటాన్ చెరు, ఏప్రిల్ 8 :పటాన్ చెరులోని ఓ ఇంట్లో గంజాయి పట్టుబడింది. మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రోహిబిషన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.... బీహార్ రాష్ట్రానికి చెందిన లాలన సహాని పటాన్ చెరులోని గోకుల్ నగర్ లో ఓ ఇంట్లో అద్దెకు నివాసం ఉంటూ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. బీహార్ నుంచి గంజాయి తీసుకొచ్చి ఇక్కడ అధిక ధరలకు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరిండెంట్ కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం సీఐ గాంధీ నాయక్, ఎస్త్స్ర యాదయ్య, హెడ్ కానిస్టేబుల్ లు ఎండి అలిమ్, సతీష్ మోహన్, కానిస్టేబుళ్లు కరీమా ప్రహల్లాద రెడ్డిలు లాలన సహాని నివాసముండే ఇంట్లో తనిఖీలు చేయగా 756 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు తెలిపారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు తెలిపారు.