29-10-2025 12:00:00 AM
ఆర్మూర్, అక్టోబర్27 (విజయ క్రాంతి): మున్సిపల్ పరిధిలో గల 8వ వార్డు నుండి బిఆర్ఎస్ యువజన నాయకుడు అరుణ్ తన 150మంది అనుచరులతో బైక్ ర్యాలీ తో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కి స్వాగతం పలికారు, అనంతరం బీజేపీ పార్టీ లో150మందితో కలిసి చేరారు వీరికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అరుణ్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు నచ్చి మోదీ అభివృద్ధి చూసి పార్టీలో చేరడం జరిగింది అని అన్నారు, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్ సమక్షంలో జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం అని స్థానిక ఎన్నికలు గెలుపు పక్క అని బీజేపీ ఆర్మూర్ లో జెండా ఎగురవేస్తాం అని అత్యధిక కాన్సిలర్ స్థానాలు గెలవడం పక్కా అని బీజేపీలో అభివృద్ధి మాత్రమే ఉంది అని అతి త్వరలో ఇతర పార్టీల నుండి బీజేపీ లో చేరికలు ఉంటాయి.
అని నియోజకవర్గం లో ఉన్న బీజేపీ కార్యకర్తల అందరితో కలిసి బారి సభ ఏర్పాటు చేసుకుంటాం అని రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, పాల్కం వేణు, జెస్సీ అనిల్, పెద్దోళ్ల గంగారెడ్డి, కలిగోట్ గంగాధర్, మధు, పోచపడ్ శ్రీనివాస్, రాజు, చిన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.