18-06-2025 12:17:16 AM
టేకులపల్లి, జూన్ 17 (విజయక్రాంతి): రాష్ట్రం లోని రైతులకు వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ద్వారా పూర్తి స్థాయిలో సాగు చేసేటువంటి ప్రతీ ఎకరాకు రూ. 6వేలు రైతుల ఖాతాల్లో జమ చేసి, రైతన్నలకు అండగా ప్రభుత్వం నిలిచిన సందర్బంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంగళవారం టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతున్నలు, పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సం దర్బంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నా యకులు కోరం సురేందర్ మాట్లాడుతూ.. వానకాలం పంట పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగు చేసేటువం టి ప్రతి ఒక్క ఎకరాకు రైతు భరోసా అం దించి రైతన్నలను అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్ర భుత్వం ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రజలకు అండగా నిలుస్తుందని, రాష్ట్రం అ ప్పుల ఊబిలో ఉన్నపటికీ ప్రభుత్వం పథకాలను అమలు చేయటంలో వెనకడుగు వేయ కుండా ప్రజా పరిపాలన అందిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవా నాయక్, నాయకులు ఈది గణేష్, పోశాలు, రెడ్యానాయక్, బండ్ల రజినీ, సరోజిని, సరిత, రజియా, భద్రు, లక్కినేని శ్యామ్, శంకర్, మధురెడ్డి, వీరభద్రం, సర్దార్, చందర్ సింగ్, శివ, బొడ్డు అశోక్ తదితరులు పాల్గొన్నారు.