18-06-2025 12:18:27 AM
కేంద్రమంత్రికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి వినతి
హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): మల్కాజ్గిరి నియోజక వర్గంలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యా, నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి చౌదరిని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజ శేఖర్రెడ్డి కోరారు. మంగళవారం నగరానికి వచ్చిన కేంద్రమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించిన కీలకమైన విద్యా ప్రాధాన్యతలను చర్చించారు.
వాజ్పేయి నగర్లోని డిగ్రీ కళాశాలలో రూసా పథకాన్ని అమలు చే యాలని విజ్ఞప్తి చేశారు. అల్వాల్లోని ఐటీఐ కళాశాలలో మెరుగైన మౌలిక వసతులు కల్పించి, సాంకేతిక విద్యను (స్కిల్ డెవలప్మెంట్) బలోపేతం చేయడానికి తగిన నిధులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరారు.