calender_icon.png 18 June, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవ అక్రమ రవాణాను నిరోధిస్తాం

18-06-2025 12:16:15 AM

  1. ప్రజ్వల ఫౌండేషన్ సహకారంతో బాధితుల సహాయ కేంద్రం 

బాధితులను రక్షించడమే లక్ష్యం: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి):  నగరంలో మా నవ అక్రమ రవాణాను నిరోధించడానికి, పిల్లల రక్షణ కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా యాంటీ హ్యూ మన్ ట్రాఫికింగ్ యూనిట్, జువెనైల్ బ్యూరో యూనిట్లను మరింత బలోపేతం చేశారు. మంగళవారం ఉమెన్ సేఫ్టీ విభాగంలో నూతనంగా ఏర్పా టు చేసిన కార్యాలయాన్ని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మానవ అక్ర మ రవాణకు పాల్పడే ముఠాలను గుర్తించి, అమాయకులను రక్షించేందుకు ఈ కార్యాలయాలు ఉపయోగ పడతాయని చెప్పారు. వ్యభిచార గృ హాల నిర్వాహకులు, ముఠాల కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షిస్తామ ని, పెండింగ్ కేసులను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రజ్వల ఫౌం డేషన్ సహకారంతో బాధితుల సహా య కేంద్రాన్ని కూడా ప్రారంభించామని వెల్లడించారు.

ఈ కేంద్రం ద్వారా బాధితులకు అవసరమైన న్యాయ సలహాలు, నష్టపరిహారం అందేలా సహా యం చేస్తారు. ప్రజ్వల సంస్థతో ఏర్పాటైన సహాయ కేంద్రం అధికారులు బాధితుల్లో మానసిక ధైర్యాన్ని నింపేందుకు కృషి చేస్తారని, వారిని మోసం చేసిన కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడే లా బాధితులకు అండగా నిలుస్తారని ఆయన అన్నారు.

హైదరాబాద్ యాం టీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు ఇప్పటికే 23 కేసులు నమోదు చేసి 44 మందిని రక్షించారని, 71 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. కార్యక్రమంలో అదనపు పోలీసు కమిషనర్ క్రైమ్స్ అండ్ సిట్ విశ్వప్రసాద్, డీడీ డీసీపీ శ్వేత, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య, ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునిత క్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు.