calender_icon.png 7 June, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు మృతి

06-06-2025 12:39:49 AM

ఖమ్మం, జూన్ 5 (విజయ క్రాంతి): సైకిల్ మోటార్ పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఖమ్మం నగరంలో ని బైపాస్ ఎన్టీఆర్ కూడలి వద్ద లారీ ఢీ కొట్టడంతో గురువారం తండ్రి కొడుకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైనారు. వీరు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం దుబ్బ తండాకు చెందిన అజ్మీరా బాల్య (50) తన కుమారుడు సాయి కుమార్ (17).

ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో చేర్పించేందుకు గురువారం మో టార్ సైకిల్ పై ఖమ్మం రాగ బైపాస్ రోడ్డు ఎన్టీఆర్ కూడలి వద్ద లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తండ్రి ఓ టైరు కింద, కొడుకు మరో టైర్ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.

ఈ ఘటన చూసిన స్థానికులు అక్కడికి తరలివచ్చిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగానే వారు మృతి చెందినట్లు గుర్తించారు. కొడుకు భవిష్యత్తు కోసం ఆరాట పడ్డ తండ్రి అకాల మృత్యువాత పడడం తోఅక్కడి వారు చలించి పోయారు.ప్రమాద ఘటనలో మరణించిన బాల్య భార్య భారతి గ్రామ మాజీ సర్పంచ్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. దీనితో గ్రామ పెద్ద అయిన బాల్య, ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన తో వారి తండా శోకసంద్రంలో మునిగింది.