సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(AP CM Chandrababu) చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. బీజేపీ, టీడీపీ, జనసేన అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవని మంత్రి పొన్నం సూచించారు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు ద్వేషాలు రగిలించేలా ఉన్నాయన్నారు. అసందర్భ వ్యాఖ్యలు తెలుగువారి మధ్య వైషమ్యాలు రగిలించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
మీరు చొరవ తీసుకుని బీజేపీ, జనసేన నేతలకు సర్దిచెప్పాలని తెలిపారు. మరే ఎంపీ రాష్ట్ర విభజనపై(State Division) అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలన్నారు. విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(BJP MP Tejasvi Surya) వ్యాఖ్యల విషయమై స్పీకర్ కు లేఖ రాయాలని పొన్నం తెలిపారు. తేజస్వి వ్యాఖ్యలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రావాలని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో సాగడం తక్షణ అవసరమని తెలిపారు. తన వినతిని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.






