29-05-2025 07:21:09 PM
భద్రాచలం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ(Minister Danasari Anasuya Seethakka) దర్శించుకున్నారు. భద్రాచలం ప్రధాన ఆలయం వద్ద దేవాలయ సంప్రదాయ ప్రకారం దేవాలయం సిబ్బంది, అధికారులు మంత్రి సీతక్కకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గర్భ గుడిలో మూలవరును దర్శించుకోగా, లక్ష్మీ తయారి అమ్మవారి ఆలయం ఆవరణలో వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు(MLA Tellam Venkata Rao), ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.