29-05-2025 07:31:30 PM
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నల్లగొండ (విజయక్రాంతి): పశువుల అక్రమ రవాణా నివారణకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(District SP Sharat Chandra Pawar) సిబ్బందిని ఆదేశించారు. గురువారం నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి మాట్లాడారు. రానున్న బక్రీద్ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లాలో ప్రత్యేక చెక్ పోస్ట్ ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల అక్రమ రవాణా నివారణకు అప్రమత్తంగా ఉండాలనీ సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ప్రతి వెహికల్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు.
జిల్లాలో చెక్ పోస్టుల వద్ద 24 గంటలూ పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తూ, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఎవరైనా చట్టవిరుద్ధంగా పశువులను అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశువుల క్రయ విక్రయాలు జరిపే రైతులు మరియు వ్యాపారులు సంబంధిత గ్రామ పంచాయతీ లేదా మునిసిపల్ అధికారులచే ధృవీకరించబడిన రశీదులను తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచన చేశారు.