29-05-2025 07:12:43 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈనెల 31 వరకు మాత్రమే జొన్నల కొనుగోలు నిర్వహించడం జరుగుతుందని మార్క్ఫెడ్ ఉమ్మడి జిల్లా అధికారి ప్రవీణ్ రెడ్డి(Markfed Joint District Officer Praveen Reddy) తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 72 36 మంది రైతుల వద్ద నుంచి జొన్నల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న జొన్నాలను ఈనెల 31 లోపు తూకం వేయడం జరుగుతుందని ఆ తర్వాత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను మూసివేయడం జరుగుతుందని ఆయన వివరించారు. రైతులు ఈ అవకాశాలు సద్వినించుకోవాలన్నారు.