16-09-2025 02:10:49 PM
హైదరాబాద్: కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్(Minister Anupriya Patel)తో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రబీ సీజన్ లో ఏర్పడిన యూరియా లోటును ఇబ్బంది లేకుండా వెంటనే భర్తీ చేయాలని మంత్రి తుమ్మల కోరారు. అలాగే ఈ నెలలోనే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి ఇవ్వాలని మంత్రి అనుప్రియ పటేల్ ను కోరారు. మంత్రి అనుప్రియ పటేల్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ కారణాల వల్లనే యూరియా సరఫరాలో ఇబ్బందులు తలెత్తాయని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా రాష్ట్రానికి యూరియా సరఫరా చేస్తామని మంత్రి అనుప్రియ పటేల్ వెల్లడించారు.