11-02-2026 06:46:43 PM
9వ వార్డులో గందరగోళం
కాంగ్రెస్ - బిజెపి మధ్య స్వల్ప వాగ్వివాదం
షాద్నగర్,(విజయక్రాంతి): కౌంటర్ ఓటు వేసే విషయంలో మహిళకు ఒక పార్టీ వారు మద్దతు పలికితే మరో పార్టీ వారు వేయవద్దని అడ్డు చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టణంలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ బిజెపి నాయకులు ఒక్క ఓటు విషయంలో గలాటపడ్డారు. బీహార్ కు చెందిన ఓ మహిళ ఓటు వేయడానికి రాగా తన ఓటు వేరే వాళ్ళు వేశారని, చాలెంజ్ ఓటు వేస్తామని చెప్పి పోలింగ్ స్టేషన్ వద్దకు రావడంతో అసలు ఆమె దొంగ ఓట్లు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు.
అప్పటికే సదరు మహిళ ఓట్లు వేసి వెళ్లిందని దాదాపు ఈ బూతులో బిజెపి నాయకులు 20 నుండి 30 ఓట్లు దొంగ ఓట్లు వేయించారని అక్కడ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మాధవులు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ప్యాట అశోక్ కు సంబంధించిన ఇరువర్గాల పార్టీల నాయకులు ఓటు విషయంలో గలాటా పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఏసిపి లక్ష్మీనారాయణ సిఐ విజయ్ కుమార్ మోహరించిన ఇరువర్గాలను చెదరగొట్టారు. సదరు మహిళను ఎసిపి లక్ష్మీనారాయణ తీసుకెళ్లి విచారించారు. చివరకు ఆమె ఓటు వేయకుండానే వెనుతిరిగింది. అయితే ఈ ఒక్క ఓటు విషయంలో ఇరువర్గాలు బాహాబాహికి దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.