12-06-2025 12:40:37 AM
భద్రాద్రి కొత్తగూడెం,జూన్ 11, (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వేతనాలను వెంటనే విడుదల చె య్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ. యాకూబ్ పాషా బుధవారం నాడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా గల 204 మైనారిటీ పాఠశాలలు, 204 కళాశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది ఔట్ సోర్సింగ్, టీచింగ్ - నాన్ టీచింగ్, నాన్ సాంక్షన్ ఉద్యోగులకు గత 2 నెలలుగా ప్రభుత్వం వేతనాలు చెల్లించని కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఈ నెలలో జరిగిన ఈద్ ఉల్ ఆదా(బక్రీద్) పండుగ కూడా జరుపుకోలేక పస్తులు ఉండేపరిస్తితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలీ చాలని వేతనాలతో దుర్భర జీవితం గడుపుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు సక్రమంగా చె ల్లించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అవుతుందని అన్నారు. ప్రభుత్వం మైనారిటీ గురుకులాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి గత 2 నెలల నుండి పెండింగ్ లో ఉ న్న వేతనాలను వెంటనే విడుదల చేయడంతో పాటు ప్రతీ నెల క్రమంగా వేతనాలు చెల్లించాలి అని ప్రభుత్వాన్ని కోరారు.