25-12-2025 02:03:59 AM
బోర్డు నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం
సనతనగర్, డిసెంబర్ 24 (విజయక్రాంతి):- బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం లో అధికారిక సభ్యులు కాకపోయిన కొంద రు వ్యక్తులు, తాము ఆలయ నిర్వహణకు చెందినవారిలా ప్రవర్తిస్తూ అమాయక భక్తులపై మాటల దాడులు చేస్తూ, అవమాన కరంగా వ్యవహరిస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దర్శనానికి వచ్చే భక్తులను బెదిరించేలా, దూషణాత్మకంగా ప్రవర్తించడం వల్ల ఆలయ పవిత్ర వాతావరణం పూర్తిగా భంగం చెందుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఆలయ బోర్డు మెంబర్లు తమ బాధ్య తలు, అర్హతలను మరిచి, ఈ అనధికార వ్యక్తుల దుర్వ్యవహారాన్ని అడ్డుకోకుండా మౌనంగా ఉండడం. పాలనా బాధ్యతలు వహించాల్సిన వారే స్పందించకపోవడంతో ఆలయ నిర్వహణపై భక్తుల విశ్వాసం క్రమం గా తగ్గిపోతోందని వారు వాపోతున్నారు. అదేవిధంగా, ఆలయంలో విధులు నిర్వహిస్తున్న శ్రీదేవి అనే ఉద్యోగి కూడా ఇలాంటి అనుచిత ప్రవర్తనకు పాల్పడుతున్నారనే ఆరోపణలు భక్తుల్లో ఆశ్చర్యం, తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఆలయ సిబ్బంది నుంచే ఈ తరహా ప్రవర్తన ఎదురవుతుంటే, భక్తులు ఎవరి వద్ద న్యాయం కోరాలనే ప్రశ్న తలెత్తుతోందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణంలో అశ్లీల మాటలు, అవమానకర ప్రవర్తన చోటుచేసుకోవడం భక్తుల ధార్మిక భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. భక్తి, శాంతి, నియ మ నిష్ఠలకు ప్రతీకగా నిలవాల్సిన ఎల్లమ్మ తల్లి ఆలయ గౌరవం, ప్రతిష్ఠ ఈ ఘటనల వల్ల తీవ్రంగా మసకబారుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పునఃపునః ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఉన్నతాధి కారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం మరింత ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బోర్డు మెంబర్లు కూడా తమకు అప్పగించిన బాధ్యతల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా, బ్యానర్లు ప్రదర్శించేందుకు ఇచ్చే అనుమతులను దుర్వినియోగం చేస్తున్నారని, ఆలయంలో నిజంగా బాధ్యతగా పని చేసే సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, సేవ చేయని వ్యక్తులకు సభ్యులు అనే పేరుతో గౌరవప్రదమైన పదవులు అనవసరంగా కట్టబెట్టడం ఏ మేరకు న్యాయమని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయాన్ని ఇప్పటికే ఆలయ ఈఓ శేఖర్కి తెలియజేశామని భక్తులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫలితం కనిపించకపోవడం తీవ్ర నిరాశను కలిగిస్తోందని వారు వాపోతున్నారు. తక్షణం మరియు నిర్ణాయక చర్యలు తీసుకోకపోతే, బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ పవిత్రతకు, ప్రజల విశ్వాసానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భక్తులు హెచ్చరిస్తున్నారు.