25-12-2025 02:05:23 AM
సనతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సనతనగర్, డిసెంబర్ 24 (విజయక్రాంతి):- రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అసలైన అభివృద్ధి జరిగిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నా రు. బుధవారం బేగంపేట డివిజన్ ఓల్ కష్టమ్ బస్తీలో ఒక కోటి 67 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, స్ట్రామ్ వాటర్ లైన్ పనులను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
అధికారులతో కలిసి బస్తీ మొత్తం తిరిగి ప్రజ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బస్తీలో ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని బస్తీ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. బస్తీ గుండా వెళ్తున్న నాలాలో వ్యర్ధాలను చూసి వెంటనే పూడిక తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఖబరస్థాన్ను సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. బస్తీలో ని పలు చోట్ల రోడ్లు సక్రమం గా లేకపోవడం, స్ట్రామ్ లైన్ లేకపో వడంతో ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృ ష్టికి స్థానికులు తీసుకు రాగా రోడ్ల నిర్మాణం, స్ట్రామ్ వాటర్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
అనం తరం మీడియాతో మాట్లాడు తూ గతంలోని నాయకులు ఓల్ కష్టమ్ బస్తీని కేవలం ఓట్ల కోసమే వాడుకున్నారని, బస్తీలోని సమస్యలను విస్మరించారని విమర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే జరిగాయని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలలో రోడ్లు, డ్రైనేజీ లైన్ ల సమస్యలను పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రతి సం వత్సరం వర్షాకాలంలో బ్రాహ్మణ వాడి, వడ్డెర బస్తీ వరద ముంపుకు గురై ప్రజలు అనేక అవస్థలు పడ్డారని, తాను వచ్చిన తర్వాత 45 కోట్ల రూపాయల వ్యయంతో నాలాకు రిటైనింగ్ వాల్ నిర్మాణం, డ్రైనేజీ లైన్ల ఏర్పా టుతో సమస్యను పరిష్కరించగలిగామని వివరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ టి. మహేశ్వరి, ఈఈ సుబ్రమణ్యం, వాటర్ వర్క్స్ జీఎం వినోద్, ఆశిష్, అనిత, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్ ఆరీఫ్, శేఖర్, నాగరాజు, అఖిల్, బస్తీ వాసు లు అబ్బాస్, వాహిద్, సాబేర్, మోహిన్ ఉన్నారు.