14-06-2025 12:00:00 AM
కుమ్రం భీం అసిఫాబాద్ జూన్13 (విజయక్రాంతి) : ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ మహాత్మ జ్యోతి బాపూలే బాలికల గురుకుల పాఠశాల కు చెందిన విద్యార్థినిలు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. గత నెల 25న నేపాల్ వెళ్లిన విద్యార్థినిలు 27న ఎవరెస్టు శిఖరం ఎక్కెందుకు కాలి నడకన బయలుదేరారు. తొమ్మిదవ రోజు( ఈనెల 5 న) శిఖరానికి చేరుకున్నారు.
బిసి గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబాబాద్, నిజామా బాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి 20 మంది విద్యార్థులు ఇంకెందుకు బయలుదేరారు ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు విద్యార్థులు హిమబిందు, బిక్కుబాయి ఉన్నారు. ఎవరె స్టు శిఖరాన్ని అధిరోహించిన విద్యార్థినులను పాఠశాల ప్రిన్సిపాల్ రత్నాబా యి, సిబ్బంది అభినందించారు.