14-06-2025 12:00:00 AM
ఆరు గ్యారంటీల అమలు ఎక్కడ?
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్
మంచిర్యాల, జూన్ 13 (విజయక్రాంతి) : ఎన్నికల వాగ్దానాలు వాగ్ధానాలుగానే మిగిలిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేన శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హా ల్లో నిర్వహించిన జిల్లా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై సీపీఐ జిల్లా నాలుగవ మహాసభల పోస్టర్ను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల వాగ్దానాలన్నీ వాగ్దానాలుగానే మిగిలిపోతున్నాయన్నారు.
ఆరు గ్యాలంటీల అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ లు, చేయూత అని 4 వేలు ఇస్తామని, మహిళలకు మహాలక్ష్మి రూ. 2500 ఇస్తాం అనీ, రైతు భరోసా రూ. 15 ఇస్తామన్న ఎన్నికల హామీ అమలు కాలేదన్నారు. ఈ నెల 21, 22 తేదీలలో సీపీఐ జిల్లా మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి పాల్గొననున్నారన్నారు.
ఈ మహాసభలో పాల్గొని మహాసభ లను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, మేకల దాసు, మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కలిందర్ అలీ ఖాన్, లింగం రవి, ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి శ్రీనివాస్, మిరియాల రాజేశ్వరరావు, మిట్టపల్లి పౌలు, వనం సత్యనారా యణ, దొడ్డిపట్ల రవీందర్, పూజారి రామన్న, కొత్తపల్లి మహేష్, కొమురయ్యలు పాల్గొన్నారు.