ఎమ్మెల్యే పరామర్శ
22-08-2026 04:00 PM
కుబీర్ (విజయక్రాంతి): తానూర్ మండలం మొగ్లి గ్రామానికి చెందిన భుజంగ్ సింగ్ కారోబారి ఇటీవలే అనారోగ్యంతో మృతి చందగా ఆ కుటుంబాన్ని ,ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ శనివారం పరామర్శించారు. .ఈ కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా కల్పించారు.మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. వారితో పాటు ప్రజా ప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ఉన్నారు.






