16 April, 2026 | 7:25 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

దళారులను నమ్మి మోసపోవద్దు

21-04-2025 01:18 PM

ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని తిమ్మజిపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరి కోతలు అనంతరం దుమ్ము, ధూళి లేకుండా తూర్పు ఆరబెట్టి ఎండబెట్టి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సరైన మద్దతు ధర అందుతుందన్నారు.

అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రంలోనూ సిబ్బంది అధికారులు రైతులకు త్వరితగతిన డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలోనూ ధాన్యం తడిసిన రైతులు(Farmers) అధైర్య పడొద్దు అన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.