30 June, 2026 | 10:13 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

దళారులను నమ్మి మోసపోవద్దు

21-04-2025 01:18 PM

ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి(MLA Kuchukulla Rajesh Reddy) అన్నారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని తిమ్మజిపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వరి కోతలు అనంతరం దుమ్ము, ధూళి లేకుండా తూర్పు ఆరబెట్టి ఎండబెట్టి వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సరైన మద్దతు ధర అందుతుందన్నారు.

అనవసరంగా దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కొనుగోలు కేంద్రంలోనూ సిబ్బంది అధికారులు రైతులకు త్వరితగతిన డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల నేపథ్యంలోనూ ధాన్యం తడిసిన రైతులు(Farmers) అధైర్య పడొద్దు అన్నారు. పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. సన్నరకం వడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నామని, రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.