14-07-2025 12:00:00 AM
పెద్దపల్లి, జూలై 13(విజయ క్రాంతి) పట్టణంలోని తెనుగువాడ వద్ద గల పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం బోనాల మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గ ప్రజలు పెద్దపల్లి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, ముదిరాజ్ సంఘం సభ్యులు, ముదిరాజ్ కులస్తులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.