7 July, 2026 | 7:32 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

మన్ కీ బాత్ ద్వారా ప్రజలకు మోదీ మరింత చేరువ

30-03-2025 05:00 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): మన్ కీ బాత్ వల్ల భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మరింత చేరువ అయ్యారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుమున శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం నెన్నల మండల అధ్యక్షులు అంగలి శేఖర్, 210 బూత్ అధ్యక్షులు లింగంపల్లి మహేష్ ఆధ్వర్యంలో ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రధాని మోదీ 2014లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అప్పటినుండి ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తున్నారని తెలిపారు. భారత దేశ ప్రజల విజయాలను ఈ కార్యక్రమంలో పంచుకుంటారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఇప్ప పువ్వు లడ్డు గురించి మోదీ ప్రశంసించారని తెలిపారు. సామాన్య ప్రజల భావాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంతోష్, గడ్డం వంశీ, స్వామి, శంకర్, రాజేష్, పవన్, మహేష్, బానేష్, హనుమంతు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.