పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ
14-03-2026 01:43 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేక నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఇబ్బందు లు పడుతున్నారు. జనకపూర్ ప్రాం తంలోని ఒక బంక్లో మాత్రమే పెట్రో ల్ అందుబాటులో ఉండటంతో అక్కడ భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు గంటల తరబడి క్యూలో నిలబడి ఇంధనం కోసం వేచి చూ డాల్సి వస్తోందని వాహనదారులు తెలిపారు. పెట్రోల్ కొరత కారణంగా ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతోంది. సరఫరా త్వరలో సాధా రణ స్థితికి వస్తుందని బంక్ నిర్వాహకులు తెలిపారు.




