1 September, 2026 | 9:44 PM

పెద్దమల్లారెడ్డిలో ఎంపీడీవో పర్యటన.. విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ

01-09-2026 | 06:55pm

భిక్కనూర్,(విజయక్రాంతి): పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీని(Peddamalla Reddy Gram Panchayat) ఎంపీడీవో సవితారెడ్డి(MPDO Savitha Reddy) సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. అనంతరం పలుగడ్డ బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను(Elementary school) సందర్శించి విద్యార్థులకు(Students) యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని  సూచించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.