15 June, 2026 | 7:03 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

పాఠశాలలకు బాంబు బెదిరింపులు

10-12-2025 11:59 AM

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బుధవారం ఉదయం బాంబు బెదిరింపు(Bomb Threats) కాల్ రావడంతో అత్యవసర చర్యలు చేపట్టి, ప్రజలను తరలించామని ఢిల్లీ అగ్నిమాపక సేవల (Department of Delhi Fire Service) అధికారి తెలిపారు. లవ్లీ పబ్లిక్ స్కూల్ లోపల పేలుడు పరికరాన్ని అమర్చారని పేర్కొంటూ ఉదయం 10.40 గంటల ప్రాంతంలో బెదిరింపు కాల్ వచ్చింది. ఈ సమాచారాన్ని వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఇతర అత్యవసర సంస్థలకు తెలియజేశారు. అనేక అగ్నిమాపక దళాలు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు, అనుమానాస్పదంగా ఏమీ దొరికినట్లు నివేదికలు లేవని పోలీసులు తెలిపారు.