21-02-2026 05:21:49 PM
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని లోక్యతండా ప్రాథమికోన్నత పాఠశాలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్ క్రాస్ రోడ్డుకు చెందిన తాటి శ్రీనివాస్ వాటర్ కూలర్ ను బహుకరించారు. వేసవికాలం దృష్ట్యా విద్యార్థులకు చల్లని నీరు అందించేందుకు వాటర్ కూలర్ ను అందించాలని నిర్ణయించి శనివారం సర్పంచ్ వెంకట్ సమక్షంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాదె వెంకన్నకు అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ... వేసవి కాలంలో విద్యార్థులకు వాటర్ కూలర్ అందించడం అభినందనీయమన్నారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. హెచ్ఎం మాట్లాడుతూ.. దాతలు మందుకు వచ్చి విద్యాభివృద్ధికి తోడ్పాటును అందించడం ఇతరులకు ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా దాత శ్రీనివాస్ ను సర్పంచ్ వడ్త్యా. వెంకటేష్, ఉప సర్పంచ్ నీలమ్మ, వార్డ్ సభ్యులు, వడిత్య శ్రీను ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభద్ర, రవిరత్నం విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.