21 March, 2026 | 7:25 PM

Breaking News

మున్సిపాలిటీలోని రోడ్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలి   •   అభివృద్ది పనులను పరిశీలించిన ఎంఎల్ఏ   •   ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర   •   అంజనాద్రిని దర్శించుకున్న పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు   •   నిర్మల్ బుద్ధ విహార్‌లో 6వ రోజు కొనసాగిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భీమ్ జ్ఞాన దీక్షలు   •   కామారెడ్డి డిక్లరేషన్ కు కార్యరూపం ఎప్పుడూ...?   •   టీజీ ఆర్టీసీ ఆధ్వర్యంలో కాశీ అయోధ్యకు బస్సు సర్వీసు   •   గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు సాధించాం   •   కుల మతాల కతీతంగా మతసామరస్యానికి ప్రతీక రంజాన్   •   ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి   •  

నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్ ప్రదానం

29-04-2025 01:32 AM

పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వారు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: న్యూఢిల్లీలో సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ గ్రహీ తలకు అవార్డులు ప్రదానం చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ, మరణానంతరం పద్మ అవార్డు పొందిన మిరియాల అప్పారావు (ఆయన తరఫున ఆయన కూతురు బుర్రకథ కళాకారిణి శ్రీదేవి) అవార్డులు స్వీకరించారు.

నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ అవార్డు రాగా, కళా రంగంలో నాగఫణి శర్మ, మిరియాల అప్పారావుకు పద్మశ్రీలు వరించా యి. 139 మందికి జనవరి 26న పద్మ అవార్డులను ప్రకటించగా.. సోమవారం కొంత మందికి అవార్డులు ప్రదానం చేశారు.